Gandhi jayanthi

02/10/2012 10:52

 

 

మహాత్మ  గాంధి ఆలోచనలు నేటికీ ఆచరణీయం : కెంగర్ల మల్లయ్య

భారత స్వతంత్ర ఉద్యమం ను  శాంతి ,త్యాగం  సామరస్యం ల తో గాంధీజీ సాగించి విజయం సధించా ర ని  ఈనాటికీ శాంతి ద్వారానే  ఏ దైన  సాధించవచ్చని  టి .బి. జి. కే. ఎస్. అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య అన్నారు. గాంధి జయంతి సందర్భంగా గోదావరిఖని  చౌరస్తా లోని  గాంధి విగ్రహానికి అయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధిజీ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని అందుకే  ఆయన  జీవితం నేటికి ఆదర్శ ప్రాయమని, కొనియాడారు  అని నేటి యువత ఆయనను ఆదర్శం గా తీసుకోని అభివృద్దిలోకి రావాలని అయన పిలుపునిచ్చారు . తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పటి   వరకు శాంతి మార్గం లో పయనిచిందని , రాబోయే కాలంలో కూడా శాంతి  మార్గం లోనే  పయనించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రం లో టి బి జి కే ఎస్ నాయకులు  నూనె కొమురయ్య ,గద్ద కుమార స్వామి. భాస్కర్ రెడ్డి, మజిక్ హరి, దండె రవి,  కుంట కొమురయ్య, అంతయ్య ,దాసరి మొగిలి, పూర్మ సత్యనారాయణ , దామ నరసయ్య ,దాసి ఎల్లయ్య ,జాబు పోషం, పూర్ణచ్గందర్ ,రాజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.